డిగ్రీ, పీజీ, డిప్లొమా అర్హతలతో 'పీఎన్బీ'లో ఉద్యోగాలు.. పొడిగించిన దరఖాస్తు గడువు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది;
భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిని ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులు రిస్క్, క్రెడిట్, ట్రెజరీ, లా, ఆర్కిటెక్ట్, సివిల్, ఎకనామిక్, హెచ్ఆర్ విభాగాల్లో ఉన్నాయి. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 29 తోనే ముగిసినప్పటికీ తాజాగా ఆ గడువును అక్టోబర్ 6 వరకు పొడిగించారు. మొత్తం ఖాళీలు: 535
మేనేజర్ రిస్క్-160
మేనేజర్ క్రెడిట్ - 200
మేనేజర్ ట్రెజరీ - 30
మేనేజర్ లా - 25
మేనేజర్ సివిల్ - 08
మేనేజర్ ఎకనామిక్ - 10
సీనియర్ మేనేజర్ రిస్క్ - 40
సీనియర్ మేనేజర్ క్రెడిట్ - 50
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, సీఏ/ ఐసీడబ్ల్యుఏ/ఎంబీఏ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్ధిష్ట అనుభవం ఉండాలి.
వయసు: పోస్టులను బట్టి 25-37 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 08,2020
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 06,2020
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.175, మిగిలిన వారికి రూ.850
ఆన్లైన్ పరీక్ష తేదీ : అక్టోబర్/నవంబర్
వెబ్సైట్: https://www.pnbindia.in/