Post Office Scheme: పోస్టాఫీస్ స్కీమ్: ప్రతిరోజూ రూ. 95 పెట్టుబడి.. మెచ్యూరిటీలో రూ. 14 లక్షలు..
Post Office Scheme: పోస్టాఫీస్ స్కీమ్లో పెట్టుబడి భద్రతతో పాటు అద్భుతమైన రాబడిని అందించే అవకాశం లభిస్తుంది.;
Post Office Scheme: పోస్టాఫీస్ అందించే గ్రామ సుమంగల్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్లాన్లో, రోజువారీ రూ. 95 పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 14 లక్షలు పొందవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పెట్టుబడిదారులకు గ్రామ సుమంగల్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం ఉత్తమమైనది. పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ ప్రకారం, ఈ పథకం గరిష్టంగా రూ. 10 లక్షల హామీతో కూడిన మనీ బ్యాక్ పాలసీ.
నిర్ణీత సమయంలో రాబడి అవసరమయ్యే పెట్టుబడిదారులకు ఈ పథకం ఉత్తమమైనది. పాలసీ కింద, బీమాదారునికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. భీమాదారుడు ఊహించని మరణానికి గురైతే, నామినీకి లేదా చట్టపరమైన వారసుడికి, బోనస్తో పూర్తి హామీ ఇవ్వబడుతుంది.
గ్రామ సుమంగళ్ యోజనలో వయోపరిమితి
గ్రామ సుమంగళ్ యోజనలో పెట్టుబడి పెట్టడానికి కనీస వయస్సు 19 సంవత్సరాలు. 20 ఏళ్ల టర్మ్ పాలసీకి 40 ఏళ్లు, 15 ఏళ్ల టర్మ్ పాలసీకి 45 ఏళ్లు గరిష్ట వయస్సుగా నిర్ణయించబడింది.
మెచ్యూరిటీపై బోనస్
గ్రామ సుమంగల్ యోజనలో, పెట్టుబడిదారుడు మూడు సార్లు మనీ బ్యాక్ ప్రయోజనాలను పొందుతాడు. 15 ఏళ్ల పాలసీలో 6, 9, 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 20 శాతం మనీ బ్యాక్ లభిస్తుంది. మెచ్యూరిటీపై, బోనస్తో సహా మిగిలిన 40 శాతం డబ్బు కూడా పెట్టుబడిదారుడికి అందించబడుతుంది.
రోజూ రూ.95 పెట్టుబడి పెట్టి రూ.14 లక్షలు పొందడం ఎలా?
25 ఏళ్ల వయస్సు ఉన్న ఇన్వెస్టర్ రూ. 7 లక్షల బీమా మొత్తంతో 20 ఏళ్లపాటు పాలసీలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, నెలవారీ వాయిదా రూ. 2853 లేదా రోజుకు దాదాపు రూ. 95 వస్తుంది. ఈ సందర్భంలో వార్షిక ప్రీమియం రూ. 32,735 అవుతుంది.
8వ, 12వ మరియు 16వ సంవత్సరాలలో పెట్టుబడిదారులు రూ.1.4 లక్షలు అందుకుంటారు. 20వ సంవత్సరంలో, రూ. 2.8 లక్షల బీమా మొత్తం ప్రయోజనం, ప్రతి వెయ్యికి రూ. 48 వార్షిక బోనస్తో పాటు అందించబడుతుంది.
మొత్తం బోనస్ 20 ఏళ్ల వ్యవధిలో రూ.6.72 లక్షలుగా ఉంటుంది. అన్ని వాయిదాలు మరియు బోనస్లను కలిపితే, మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడిదారులు మొత్తం రూ. 13.72 లక్షలు పొందుతారు.