ప్రణబ్‌కు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి ఆయన అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం..

Update: 2020-09-01 05:36 GMT

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలోని లోథి ఎస్టేట్‌లో జరగనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రణబ్‌ ముఖర్జీ.. ఆయన నివాసానికి చేరుకొని ప్రణబ్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ప్రణబ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రధాని. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌, త్రివిధ దళాధిపతులు కూడా ప్రణబ్‌ చిత్రపటానికి అంజలి ఘటించారు. 

Tags:    

Similar News