రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు బైపాస్ సర్జరీ సక్సెస్..!
ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఈ సర్జరీ చేసినట్లుగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విటర్లో వెల్లడించారు.
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు బైపాస్ సర్జరీ విజయవంతంగా జరిగింది. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఈ సర్జరీ చేసినట్లుగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విటర్లో వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశించారు. కాగా ఛాతీలో నొప్పి కారణంగా ఈ నెల 26న రామ్నాథ్ కోవింద్ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.. అక్కడ సాధారణ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అనంతరం ఎయిమ్స్కు సిఫార్సు చేశారు.