శాస్త్రవేత్తలు, వైద్యులు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు

వాక్సిన్‌కు డీసీజీఐ ఆమోద ముద్ర వేయడంపై.. శాస్త్రవేత్తలు, వైద్యులు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

Update: 2021-01-03 08:44 GMT

వాక్సిన్‌కు డీసీజీఐ ఆమోద ముద్ర వేయడంపై.. శాస్త్రవేత్తలు, వైద్యులు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అత్మనిర్భర్ భారత్ కలను శాస్త్రవేత్తలు సాకారం చేశారని కొనియాడారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో ముందు వరసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు, శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ.

Tags:    

Similar News