ప్రశ్నోత్తరాల సమయం కట్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. జీరో అవర్ కూడా కేవలం అరగంట

Update: 2020-09-02 03:36 GMT

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. జీరో అవర్ కూడా కేవలం అరగంట మాత్రమే ఉంటుందని తెలిపింది. అయితే, ఈ నిబంధనలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజాసమస్యలపై చర్చించే అవకాశం లేకుండా చేస్తున్నారని.. ప్రజాస్వామ్యగొంతు నొక్కుతున్నారని మండిపడుతున్నారు. అయితే, దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నేతలతో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ఫోన్లో మాట్లాడుతూ.. సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని అభ్యర్థించారు. 

Tags:    

Similar News