Rahul Gandhi: అందుకు నా తల నరికేయాలి : రాహుల్ గాంధీ

వరణ్ గాంధీ పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు; భారత్ జోడో యాత్రలో వరణ్ పాల్గొనడంపై రాహుల్ మండిపాటు

Update: 2023-01-17 12:30 GMT

భారత్ జోడో యాత్రలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ పాల్గొంటారా అన్న ప్రశ్నకు రాహుల్ స్పందించారు. తన సోదరుడు వరుణ్ గాంధీ అనుసరిస్తున్న సిద్ధాంతాన్ని తాను అంగీకరించలేనని తెలిపారు. రాహుల్ తలపెట్టిన జోడో యాత్ర ప్రస్తుతం పంజాబ్ లో కొనసాగుతుంది. హోషియాపూర్ లో మీడియాతో యాట్లాడిన ఆయన, వరుణ్ సిద్దాంతాన్ని తాను అంగీకరించలేనని, ఒకవేళ వరుణ్ భారత్ జోడో యాత్రలో పాల్గొంటే అది ఆయనకు సమస్యాత్మకమవుతుందని అన్నారు.

" నా కుటుంబానికి ఒక ఐడియాలజీ ఉంది, వరుణ్ మరొక ఐడియాలజీని తీసుకున్నాడు. అతను అనుసరిస్తున్న సిద్దాంతాన్ని అంగీకరించలేను. నేను ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లలేను, అంతకు ముందే తన తల నరికివేయాల్సి ఉంటుంది" అని రాహుల్ అన్నారు. వరుణ్ గాంధీ జోడో యాత్రలో చేరడంపై ఊహాగానాలు చెలరేగాయి. గతంలో వరుణ్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన క్లిప్స్ ను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేసింది.

ఉత్తర్ ప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీలుగా మేనకా గాంధీ, వరుణ్ గాంధీలు ప్రాతినిధ్యం వ్యవహరిస్తున్నారు. వీరిద్దరు ప్రధాని మోడీ మంత్రివర్గంలో భాగం కాదు. 2019 ఎన్నికల ప్రచారంలో కూడా మేనక, వరుణ్ బీజేపీ తరఫున ప్రచారం చేయలేదు. వరుణ్ గాంధీ తనతో కలవాలంటే బీజేపీ-ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు రావాలని సూచించారు రాహుల్. ఆర్ఎస్ఎస్ - బీజేపీని బహిరంగంగా ఖండించాలని తెలిపారు.

Tags:    

Similar News