Rahul Gandhi : కోవిడ్‌ ఫస్ట్, సెంకడ్ వేవ్‌లు ఎదుర్కోవడంలో కేంద్రం విఫలం : రాహుల్‌ గాంధీ

Rahul Gandhi : కరోనా మొదటి, రెండో దశను ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైందన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాుహల్‌ గాంధీ. థర్డ్‌వేవ్‌పై నిపుణులతో వెబినార్‌ నిర్వహించారు.

Update: 2021-06-22 08:35 GMT

Rahul Gandhi : కరోనా మొదటి, రెండో దశను ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైందన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాుహల్‌ గాంధీ. థర్డ్‌వేవ్‌పై నిపుణులతో వెబినార్‌ నిర్వహించారు రాహుల్‌గాంధీ. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం ఇప్పటికైనా సన్నద్దంగా ఉండాలన్నారు. వైరస్‌ మ్యూటేషన్లతో మరింత అప్రమత్తం అవసరమన్నారాయన. కోవిడ్‌పై కేంద్రం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సెకెండ్‌ వేవ్‌లో నిపుణుల హెచ్చరికలను కేంద్రం పట్టించుకోలేదన్నారు. పేదలు, మధ్యతరగతిపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వైద్యానికి అవసరమైన మౌలిక సదుపాలయాలను సమకూర్చుకోవాలన్నారు.

Tags:    

Similar News