ఉత్తర్ప్రదేశ్ పిలిభిత్ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పురాణ్పూర్ ప్రాంతంలో బస్, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని అధికారులు హాస్పిటల్కు తరలించారు. పలువురి పరిస్థితి విషమం ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.