ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ప్రయాగ్రాజ్ సమీపంలోని మాణిక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్వాల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కుండా నుంచి ప్రయాగ్రాజ్ వైపు వెళుతున్న బొలెరో వాహనం వేగంగా వచ్చి.. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుకభాగంలో బలంగా ఢీకొట్టింది. దీంతో బొలేరోలో ఉన్న 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
ప్రమాద సమయంలో భారీ శబ్దం విన్న స్థానికులు వెంటకనే అక్కడికి చేరుకున్నారు. కానీ.. ప్రమాద తీవ్రను చూసి ఎవరూ అక్కడికి వెళ్లే ధైర్యం చేయలేకపోయారు. ఆ తరవ్వాత పోలీసులు వచ్చాక.. వాహనాన్ని ఎక్కడికక్కడ కట్ చేసి మృతదేహాలను బయటకు తీశారు. మృతులంతా ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగివస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్టు సమాచారం.