మార్చి 1 నుంచి రెండో విడత కొవిడ్ వ్యాక్సినేషన్...!
మార్చి ఒకటి నుంచి రెండో విడత కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటిచింది. ఈ విడతలో 60 ఏళ్ల పైబడినవారికి టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపింది.;
మార్చి ఒకటి నుంచి రెండో విడత కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటిచింది. ఈ విడతలో 60 ఏళ్ల పైబడినవారికి టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగానే కరోనా టీకాలు ఇవ్వనన్నారు. ఇందుకోసం అయ్యే ఖర్చు కేంద్రమే భరిస్తుంది. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా ధర మాత్రం ప్రజలే చెల్లించాలని తెలిపింది కేంద్రం. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధర 250 రూపాయలుగా నిర్ధారించారు. సర్వీస్ ఛార్జ్తో కలిపి ఈ టీకా ధర 250 ఉంటుందని తెలిపింది కేంద్రం.