Karnataka Bitcoins : కర్ణాటక రాజకీయాల్లో బిట్‌ కాయిన్ల దుమారం..!

Karnataka Bitcoins : కర్ణాటక రాజకీయాలను బిట్‌ కాయిన్ల అంశం కుదిపేస్తోంది. ఇటీవల 9 కోట్ల రూపాయల విలువగల బిట్‌ కాయిన్ల వ్యవహారం బయటపడింది.

Update: 2021-11-13 01:49 GMT

Karnataka Bitcoins : కర్ణాటక రాజకీయాలను బిట్‌ కాయిన్ల అంశం కుదిపేస్తోంది. ఇటీవల 9 కోట్ల రూపాయల విలువగల బిట్‌ కాయిన్ల వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారంతో బీజేపీ నేతలకు సంబంధం ఉన్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. బిట్‌ కాయిన్‌ స్కామ్‌ నిందితుడు జన్‌ధన్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి 6వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపించారు.

ఈ విషయం ప్రధాని మోదీకి కూడా తెలిసుండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కర్ణాటకకు చెందిన హ్యాకర్‌ శ్రీకృష్ణ అలియాస్‌ శ్రీకి నుంచి ఇటీవల 9కోట్ల రూపాయల విలువైన బిట్‌ కాయిన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో అధికార పార్టీకి చెందిన కొందరు కీలక నేతలకు ప్రమేయం ఉన్నట్లు కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. హ్యాకర్‌ శ్రీకృష్ణ గతంలో ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాకింగ్‌ చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. క్రిప్టో కరెన్సీ ద్వారా డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు కూడా అతడిపై ఆరోపణలున్నాయి.

Tags:    

Similar News