కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్పటేల్ కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు అహ్మద్పటేల్ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 1న అహ్మద్పటేల్కు కరోనా పాజిటివ్ రావడంతో నెలరోజులుగా కరోనా చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రెండు దశాబ్దాలుగా రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. గుజరాత్ నుంచి పలుమార్లు రాజ్యసభకు ఎన్నికైన ఆయన మల్టిఫుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో తుదిశ్వాస విడిచారు.