సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం

సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుమూశారు.;

Update: 2021-04-22 06:00 GMT

సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా సోకవడంతో హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో ఆశిష్ చేరాడు. అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆశిష్‌కు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆశిష్ ఏచూరి తుదిశ్వాస విడిచారు. తన కుమారుడు మృతిచెందినట్లు సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. ఆశిష్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News