Kerala: అరుదైన దృశ్యం.. జిల్లా కలెక్టర్గా భార్య నుండి బాధ్యతలు స్వీకరించిన భర్త..
Kerala: వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట డాక్టర్లుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కేరళ కేడర్ ఐఏఎస్ అధికారులుగా నియమితులయ్యారు.;
Kerala: అలప్పుజా జిల్లా కలెక్టర్గా పదవీ విరమణ చేసిన రేణు రాజ్ ప్రస్తుతం జాయింట్ సెక్రటరీగా ఉన్న శ్రీరామ్ వెంకిట్రామన్కు బాధ్యతలు అప్పగించడం అరుదైన సందర్భం. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన భర్తను తన సీటులో కూర్చోమని వెంకిట్రామన్ను ఆహ్వానించి కరచాలనం చేశారు రేణు రాజ్. ఇంతకు ముందు రేణు రాజ్ అలప్పుజా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమెను బదిలీ చేయడంతో శ్రీరామ్ను అలప్పుజా కలెక్టర్గా నియమించారు.
అయితే అతని పోస్టింగ్ను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కార్యకర్తలు నిరసన చేయడంతో కార్యాలయం వెలుపల గందరగోళం నెలకొంది.
యాక్సిడెంట్లో ప్రమేయం ఉన్నందుకు అతన్ని అరెస్టు చేసి సర్వీస్ నుండి సస్పెండ్ చేయమంటూ నిరసనలు వెల్లువెత్తాయి. అతనికి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించే అధికారం లేదని అన్నారు. 2019లో వెంకిట్రామన్ తన స్నేహితురాలు వఫా ఫిరోజ్తో కలిసి అతివేగంగా కారు నడుపుతూ ద్విచక్రవాహనంపై వెళ్తున్న జర్నలిస్టును ఢీకొట్టి హత్య చేశారు. ప్రస్తుతం అతను బెయిల్పై ఉన్నాడు. అలప్పుజా జిల్లా కలెక్టర్గా శ్రీరామ్ వెంకిట్రామన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో ఉత్కంఠ నెలకొంది.
జిల్లా కలెక్టర్గా ఉండడం వల్ల జిల్లా మేజిస్ట్రేట్ హోదా కూడా అతడి చేతిలోనే ఉంటుంది. 'నిందితుడు' అయిన ఆయన ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాడు. అతడికి ఈ పోస్ట్ ఆమోదయోగ్యం కాదని అంటున్నారు.