నందిగ్రామ్లో రౌండ్ రౌండ్కూ ఉత్కంఠ..!
మొదట్లో తన ప్రత్యర్థి సువేందు అధికారిపై వెనకబడుతూ వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. ఆ తర్వాత ఏడో రౌండ్ నుంచి పుంజుకున్నారు.;
నందిగ్రామ్లో రౌండ్ రౌండ్కూ ఉత్కంఠ నెలకొంటుంది. రౌండ్ రౌండ్కూ అక్కడ ఆధిక్యం మారుతోంది. మొదట్లో తన ప్రత్యర్థి సువేందు అధికారిపై వెనకబడుతూ వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. ఆ తర్వాత ఏడో రౌండ్ నుంచి పుంజుకున్నారు. ప్రస్తుతం సువేందు అధికారిపై మమత.. 2331 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అటు బెంగాల్ లో టీఎంసీ విజయం దాదాపుగా ఖరారైపోయింది.