West Bengal : పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి..!

West Bengal : పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.

Update: 2022-01-13 14:52 GMT

West Bengal : పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. పట్నా నుంచి గౌహతి వెళ్తున్న గౌహతి - బికనేర్‌ ఎక్స్‌ప్రెస్‌ మైనాగురి సమీపంలో పట్టాలు తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో రైలు కేవలం 40 కిలోమీటర్ల వేగంతోనే ఉండడంతో.. పెను ప్రమాదం తప్పింది.

మొత్తం ఆరు బోగీలు తలకిందులు కాగా.. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో మొత్తం 12 కోచ్‌లు దెబ్బతిన్నాయని... సమాచారం తెలియగానే రైల్వే ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారని రైల్వే వర్గాలు తెలిపాయి. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని.. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని.. అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News