Union Budget 2022 : కేంద్ర బడ్జెట్ 2022 అప్డేట్స్
Union Budget 2022 : దేశంలో జాతీయ రహదారుల మొత్తం లక్ష 40 వేల కోట్ల కిలోమీటర్లకు పెరిగింది;
Union Budget 2022 : దేశంలో జాతీయ రహదారుల మొత్తం లక్ష 40 వేల కోట్ల కిలోమీటర్లకు పెరిగింది
భవిష్యత్తులో ఉపరితల, సముద్ర, వాయు మార్గాలను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకొస్తాం
రవాణా సౌకర్యాల అభివృద్ధికి మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది
వీటి ద్వారా చిన్న ఉద్యోగుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచాం
13.5 లక్షల MSME ల పునరుద్ధరణ కోసం కృషి చేశాం
దేశంలో చేనేత అభివృద్ధి కోసం మెగా టెక్స్టైల్ పార్కులు అభివృద్ధి చేస్తున్నాం
మొబైల్ ఫోన్లు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది
దేశంలో గత ఏడాదిలో భారీగా పెరిగిన పెట్టుబడులే దీనికి నిదర్శనం
భారత అభివృద్ధి వైపు అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఆసక్తిగా చూస్తున్నారు
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది
మా ప్రభుత్వ చర్యల వల్ల భారత్ ప్రపంచంలోనే...
5G టెక్నాలజీ అభివృద్ధికి భారత్ సర్కారు కట్టుబడి ఉంది
ప్రపంచంలో తక్కువ ధరకు ఇంటర్నెట్ అందిస్తున్న దేశంగా భారత్ నిలిచింది
వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభించింది
మనదేశంలో 7 వేలకు పైగా స్టార్టప్స్ ప్రారంభమయ్యాయి
మధ్యప్రదేశ్లో మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాన్ని ప్రారంభించాం
దివ్యాంగుల కోసం ఉచితంగా వైద్య సేవలు, ఉపకరణాలు అందిస్తున్నాం
యువతకు క్రీడా వసతులు మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నాం
పారాలింపిక్స్లో కూడా మన యువకులు సత్తా చాటారు
రికార్డు స్థాయిలో 7 పథకాలు గెలిచి మన యువకులు సత్తా చాటారు
టోక్యో ఒలింపిక్స్ లో భారత యువకులు అద్భుతాలు సృష్టించారు
ఇంజినీరింగ్ కాలేజీల్లో 6 భాషల్లో విద్యాబోధన మొదలైంది
రాష్ట్రీయ శిక్షా మిషన్ ద్వారా స్థానిక భాషలకు అత్యధిక ప్రోత్సాహం అందిస్తున్నాం
సైనిక స్కూళ్లలో కూడా బాలికల ప్రవేశాల సంఖ్య పెరుగుతోంది
ప్రభుత్వ పాఠశాలల్లో ముస్లిం బాలికల డ్రాపవుట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది
బేటీ బచావ్ బేటీ పడావ్ పథకం అద్భుత ఫలితాలను సాధిస్తోంది
ట్రిపుల్ తలాఖ్ లాంటి నిబంధనలను తొలగించాం
అలాగే మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచాం
ముద్ర రుణాలు, ఉజ్వల్ పథకాలు అత్యంత విజయవంతమవుతున్నాయి
2021-22 లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా 65 వేల కోట్ల రూపాయల రుణాలు అందించాం
గ్రామీణ మహిళ సాధికారత కోసం మా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది
అటల్ భూ జల్ పథకాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నాం
దేశంలో వర్షపు నీటి సంరక్షణకు ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నాం
వ్యవసాయంలో వైవిధ్యం చూపాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం
ఆర్గానిక్ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది
సంకల్పం ఉంటే మార్గాలు వాటంతట అవే వస్తాయనడానికి ఇది నిదర్శనం
రైతుల ఉత్పత్తుల రవాణా కోసం 150 కిసాన్ రైళ్లను నడిపిస్తున్నాం
రైతుల ఉత్పత్తులకు సరైన ధర అందించేందుకు కృషి చేస్తున్నాం
తేనె ఉత్పత్తిలో గత ఏడాదితో పోల్చితే 55 శాతం వృద్ధి సాధించాం
కరోనా కాలంలోనూ మన దేశ రైతాంగం రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించింది
స్వామిత్ర కార్డులతో పేదల ఆస్తుల పరిరక్షణతో పాటు రుణాలు పొందడం కూడా సులభమవుతోంది
పేదల ఆస్తులను పరిరక్షించే ఉద్దేశంతో స్వామిత్ర పథకం ప్రారంభించాం
ప్రతి ఇంటికీ మంచినీరు ఇచ్చేందుకు జల్ జీవన్ మిషన్ ప్రారంభించాం
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాలను ఫుడ్ డెలివరీ యాప్లతో అనుసంఘానం చేస్తున్నాం
చిన్న వ్యాపారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందిస్తోంది
దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మార్చి 2022 వరకు ఈ పథకాన్ని పొడగించాం
దేశంలో కోట్లాది మంది నిరుపేదలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నాం
ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులే దీనికి నిదర్శనం
అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలన్నదే మా లక్ష్యం
అన్ని వర్గాల అభ్యున్నతే మా ప్రభుత్వ లక్ష్యం
అంత్యోదయ అన్నదే మూల మంత్రంగా మా ప్రభుత్వం అడుగులు వేస్తోంది
ఆయుష్ ఉత్పత్తుల మొత్తం 11 వేల కోట్లకు చేరింది
కరోనా కాలంలో ఫార్మా సంస్థలు కూడా సత్తా చాటాయి
8 వేల జన ఔషధి కేంద్రాలను ప్రారంభించి తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాం
64 వేల కోట్లతో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది
కరోనా నేపథ్యంలో మా ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలను చేపడుతోంది
కరోనాను నియంత్రించి.. ప్రజలను రక్షించడంలో వ్యాక్సిన్లది కీలక పాత్ర
దేశంలో ఇప్పుడు 8 వ్యాక్సిన్లకు అనుమతి ఉంది
ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు బూస్టర్ డోస్ కూడా అందిస్తున్నాం
15- 19 ఏళ్ల యువకులకు కూడా వ్యాక్సినేషన్ జరుగుతోంది
దేశంలో 70 శాతం మంది అర్హులకు రెండు వ్యాక్సినేషన్లు అందాయి
ప్రపంచంలో ఇప్పుడు అత్యధిక వ్యాక్సిన్లు ఇచ్చిన దేశం భారతే
ఏడాది కన్నా తక్కువ సమయంలోనే 150 కోట్ల వ్యాక్సిన్లు అందించాం
ఈ కష్టకాలంలో విశేష సేవలు అందించిన అందరికీ అభినందనలు
కరోనా మహమ్మారి దేశవాసుల ముందు ఎన్నో సవాళ్లను నిలిపింది
మా ప్రభుత్వం సబ్ కా సాత్.. సబ్కా వికాస్ అన్న నినాదంతో పనిచేస్తుంది
మన దేశ ప్రజలకు అభివృద్ధి లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది - రాష్ట్రపతి
ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. రానున్న 25 ఏళ్లకు