Rahul Gandhi : రాహుల్ గాంధీకి తన ఆస్తులన్నీ రాసిచ్చిన 78 ఏళ్ల బామ్మ..!

Rahul Gandhi : ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన 78 ఏళ్ల పుష్ప ముంజియల్ అనే ఓ వృద్దురాలు తన ఆస్తి మొత్తాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి పేరు మీద రాసింది..

Update: 2022-04-05 01:58 GMT

Rahul Gandhi : ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన 78 ఏళ్ల పుష్ప ముంజియల్ అనే ఓ వృద్దురాలు తన ఆస్తి మొత్తాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి పేరు మీద రాసింది.. ఆయన ఆలోచనలను దేశానికి అవసరమని తన పేరు మీదున్న రూ. 50 లక్షల విలువైన ఆస్తులు, 10 తులాల బంగారం రాహుల్‌ గాంధీకి చెందేలా వీలునామా రాశారు. ఈ వీలునామాను కోర్టులోనూ సమర్పించారు.

సోమవారం పీసీసీ మాజీ చీఫ్‌ ప్రీతమ్‌ సింగ్‌ నివాసానికి వెళ్లిన ఆమె.. రాహుల్‌ పేరు మీదకు తన ఆస్తులు బదలాయిస్తున్న వీలునామాను అందజేశారు. ఈ వీలునామాను కోర్టులోనూ సమర్పించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు గాంధీ కుటుంబం దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిందని పుష్ప ముంజియల్ అన్నారు.

ఇక రాహుల్ గాంధీ ఆలోచనలు దేశానికి అవసరమని, ఆయన ఆలోచనలకు తాను చాలా ప్రభావితమయ్యానని, అందుకే తన ఆస్తిని ఆయనకు ఇస్తున్నానని ఆమె తెలిపారు. దేశ తొలి ప్రధాని అయిన జవహర్‌లాల్ నెహ్రూతో తన తండ్రికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా ఆ వృద్ధురాలు తెలిపింది. జీవితాంతం పెళ్లి చేసుకోని ముంజియాల్ గతంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ప్రస్తుతం ఆమె డెహ్రాడూన్‌లోని ప్రేమ్‌ధామ్ వృద్ధాశ్రమంలో నివసిస్తోంది.

Tags:    

Similar News