ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా సోకింది. ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్విట్ చేసింది. అయితే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపింది. ఆయనలో కరోనా లక్షణాలు పెద్దగా కనిపించడం లేదని వివరించింది. వెంకయ్యనాయుడు సతీమణి ఉషా నాయుడికి కరోనా నెగిటివ్ వచ్చింది.