దూకుడు పెంచిన బీజేపీ... 57మందితో తొలి జాబితా..!

పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ తమ మొదటి విడత జాబితాను విడుదల చేసింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకి గాను ప్రస్తుతం 57 స్థానాలకు గాను అభ్యర్ధులను ప్రకటించింది.

Update: 2021-03-06 15:45 GMT

పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ తమ మొదటి విడత జాబితాను విడుదల చేసింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకి గాను ప్రస్తుతం 57 స్థానాలకు గాను అభ్యర్ధులను ప్రకటించింది. ఈ జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. సీఎం మమతా బెనర్జీకి పోటిగా నందిగ్రామ్ నియోజకవర్గ అభ్యర్ధిగా సువేందు అధికారిని బీజేపీ రంగంలోకి దింపుతుంది. మొయినా నియోజకవర్గం నుంచి క్రికెటర్ అశోక్ దిండా పోటి చేయనున్నారు. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికలు మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 29 వరకు కొనసాగనున్నాయి. మొత్తం ఎనమిది దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మే 2 న ఓట్లు లెక్కింపు జరగనుంది. కాగా నిన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) ఒకేసారి 291 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.. !

Tags:    

Similar News