కరోనా వైరస్కు మార్కెట్లోకి మరో కొత్త ఔషధం..!
కరోనా వైరస్ కు మరో కొత్త ఔషధం వచ్చింది. జైడస్ సంస్థ రూపొందించిన విరాఫిన్ మందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.;
కరోనా వైరస్ కు మరో కొత్త ఔషధం వచ్చింది. జైడస్ సంస్థ రూపొందించిన విరాఫిన్ మందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యస్థ కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ఈ సూదిమందు సింగిల్ డోస్లో పనిచేస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కరోనా చికిత్సలో విరాఫిన్ డ్రగ్ సమర్థవంతంగా పనిచేస్తోందని జైడస్ సంస్థ ప్రకటించింది.. విరాఫిన్ డ్రగ్ తీసుకున్న 91 శాతం మంది పేషెంట్లు ఏడు రోజుల్లోనే కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది.. ఈ నేపథ్యంలో ఈ మందు అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.