China : బస్సు బోల్తా.. 27 మంది దుర్మరణం..

China : చైనాలోని గ్విజౌ ప్రావిన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బస్సు బోల్తా పడింది;

Update: 2022-09-18 15:00 GMT

China : చైనాలోని గ్విజౌ ప్రావిన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 27 మంది దుర్మరణం పాలయ్యారు. 47 మందితో వెళుతున్న బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన 20 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు... క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.   

Tags:    

Similar News