Srilanka Crisis : కరోనా, లాక్‌డౌన్ల వల్లే శ్రీలంకలో సంక్షోభం : గోటబయ రాజపక్స

Srilanka Crisis : శ్రీలంక ఆర్ధిక పతనానికి కరోనా, లాక్‌డౌన్లే కారణమన్న గోటబయ రాజపక్స

Update: 2022-07-17 10:00 GMT

Sri Lanka Crisis : శ్రీలంక అధ్యక్షుడు రాజీనామా లేఖ సమర్పించిన విషయం తెలిసిందే. ఆ లేఖలో గోటబయ శ్రీలంక సంక్షోభానికి కారణాలను చెప్పుకుంటూ వచ్చారు. లంక ఆర్ధిక పతనానికి చాలా కారణాలు ఉన్నా.. అందులో ప్రధానంగా కరోనా అని ఆయన అన్నారు.

లాక్‌డౌన్లతో శ్రీలంక అతలాకుతలం అయ్యిందన్నారు. అప్పటికే ఉన్న సమస్యలు మరింత తీవ్రమయ్యాయన్నారు. అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తానెంత ప్రయత్నించిన వీలు కాలేదన్నారు. భవిష్యత్‌లో శ్రీలంకకు ఉత్తమ సేవలు అందించే దిశగా క‌ృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. 

Tags:    

Similar News