బంగ్లాదేశ్‌లో భారీ పేలుడు.. 16 మంది మృతి

Update: 2023-03-08 02:35 GMT

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు సంభవించింది. ఏడంతస్తుల భవనంలో సంభవించిన పేలుడు ధాటికి 16 మంది మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు. పాత ఢాకా గులిస్థాన్ ప్రాంతంలోని సిద్ధిక్ బజార్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పేలుడుకు కారణం స్పష్టంగా తెలియకపోయినా, ఆ భవనంలో రసాయనాలు అక్రమంగా నిల్వచేస్తున్నారని, పేలుడుకు రసాయనాలే కారణం అయ్యుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి సిద్ధిక్ బజార్ మొత్తం ఊగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Similar News