Crime : భార్యను హత్య చేసి లొంగిపోయాడు

Update: 2023-03-14 04:47 GMT

భర్యాను హత్యచేసి పోలీస్టేషన్ లో లొంగిపోయాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. నలసపోరాలో ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తన పనికి బయటకు వెళ్లాడు. సాయంత్రం పని పూర్తిచేకుని వచ్చిన అతను తన భార్యను చంపినట్లు పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితున్ని అరెస్ట్ చేశారు. భార్యపై అనుమానంతోనే చంపినట్లు పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News