జనరల్ పర్పసెస్ కమిటీలో సభ్యుడిగా టీఆర్ఎస్ ఎంపీ

టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావుకు జనరల్ పర్పసెస్ కమిటీలో సభ్యుడిగా చోటు లభించింది.

Update: 2020-08-28 01:37 GMT

టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావుకు జనరల్ పర్పసెస్ కమిటీలో సభ్యుడిగా చోటు లభించింది. ఈ కమిటీ సభావ్యహారాలకు సంబంధించిన సలహాలు, సూచనలు చేసేందుకు వీలుగా పనిచేస్తుంది. ఈ కమిటీని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదం మేరకు సెక్రటరీ జనరల్ ప్రకటించారు. ఈ కమిటీలో సభ్యులుగా వైస్ చైర్మన్ ప్యానల్ సభ్యులు ఐదుగురు, స్టాండింగ్ కమిటీ చైర్మన్లు ఆరుగురు గుర్తింపు పొందిన ప్లోర్ లీడర్లు ఉంటారు. అయితే, కే కేశవరావు స్టాండింగ్ కమిటీ చైర్మన్ జాబితాలో చోటు లభించింది.

Tags:    

Similar News