ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంలో మార్పేమీ లేదు: వైద్యులు

ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంలో ఏమాత్రం మార్పు లేదని ఢిల్లీ కంటోన్మెంట్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Update: 2020-08-23 11:21 GMT

ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంలో ఏమాత్రం మార్పు లేదని ఢిల్లీ కంటోన్మెంట్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ప్రస్తుతం డీప్ కోమాలోనే ఉన్నారని.. దీంతో వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స అందిస్తున్నామని అన్నారు. శరీరంలోని కీలక అవయవాలు నిలకడగా ఉన్నాయని తెలిపింది. ప్రణబ్ ముఖర్జీ ఆగస్టు 10న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మొదట మెదడులో రక్తం గట్టకట్టడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. తరువాత కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఊపరిపిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు.ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంలో ఏమాత్రం మార్పు లేదని ఢిల్లీ కంటోన్మెంట్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
 

 

Tags:    

Similar News