మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
మహారాష్ట్రలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాయ్గఢ్ జిల్లా మహద్లో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది.;
మహారాష్ట్రలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాయ్గఢ్ జిల్లా మహద్లో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద సుమారు 200 మందికి పైగా చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే, ఇందులో ఇప్పటికే 15 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన పట్ల పలువురు విషాదం వ్యకం చేస్తున్నారు. ఈ సంఘటనలో గాయపడిన వారికి తక్షణ సాయం అందించాలని సీఎం ఆదేశించారు.