Manipur Students Killing: విద్యార్ధుల హత్యకేసులో నలుగురు అరెస్ట్
అస్సాంకు పారిపోయిన నిందితులను అదుపులోకి తీసుకున్న సీబీఐ;
మణిపూర్లో ఇద్దరు విద్యార్థులను దారుణంగా చంపిన కేసులో నలుగురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జూలైలో మణిపూర్లో జరిగిన ఇద్దరు విద్యార్థుల దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. వారిని అదుపులోకి తీసుకున్న ఫొటోలు, హత్య చేసిన తరువాత మృత దేహాల ఫోటోలు గతవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే మే ౩వ తేదీన మైతీ, కుకీ జాతుల మధ్య హింస ప్రారంభమైన ఇంఫాల్కు 51 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతం జిల్లా చురచంద్పూర్లో నిందితులు ఉన్నట్లు నిఘా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆదివారం పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. వెంటనే ఎయిర్పోర్ట్కు వారిని తరలించారు. అక్కడ ఉన్న సీబీఐ బృందానికి అప్పగించారు. అనంతరం నిందితులను విమానంలో అస్సాం రాజధాని గౌహతికి తరలించారు. అయితే నిందితుల అరెస్ట్ విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఎయిర్పోర్ట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.
కాగా, అరెస్టైన నలుగురు నిందితుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇతర నిందితులను పావోమిన్లున్ హాకిప్, మల్సాన్ హాకిప్, లింగ్నీచాంగ్ బైట్, తిన్నిఖోల్గా గుర్తించారు. హత్యకు గురైన విద్యార్థిని స్నేహితుడు లింగ్నీచాంగ్ బైట్ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు నేరం చేసి తప్పించుకున్నప్పటికీ ఏదో ఒక రోజు చట్టానికి దొరికిపోతారని మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు. ఇద్దరు విద్యార్థులను దారుణంగా చంపిన నిందితులకు ఉరిశిక్ష పడేలా చూస్తామని ఎక్స్లో పేర్కొన్నారు. మణిపూర్ సంక్షోభాన్ని ఉపయోగించుకోవడానికి మయన్మార్ మరియు బంగ్లాదేశ్కు చెందిన ఉగ్రవాదులు కొన్ని తిరుగుబాటు గ్రూపులతో చేతులు కలిపారని, ఉగ్రవాదులు మరియు రాష్ట్రానికి మధ్య కొనసాగుతున్న హింసాత్మకంగా మిస్టర్ సింగ్ అన్నారు. మరోవైపు , బంగ్లాదేశ్ , మయన్మార్లలోని తీవ్రవాద నాయకులకు సంబంధించిన అంతర్జాతీయ కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ చురచంద్పూర్ నుండి ఒక ఉగ్రవాద అనుమానితుడిని అరెస్టు చేసింది.