Uttarakhand: ఉత్తరకాశీలో క్లౌడ్‌బరస్ట్.. 9 మంది మిస్సింగ్‌

అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి;

Update: 2025-06-29 07:00 GMT

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. మేఘాలకు చిల్లులు పడ్డాయా అనేంతలా బార్‌కోట్‌-యమునోత్రి మార్గంలోని సిలాయ్‌ బాంద్‌లో వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్‌ ధ్వంసమైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈనేపథ్యంలో వారిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో పోలీసులు, ఎస్​డీఆర్‌ఎఫ్‌, ఎన్​డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొన్నాయని ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ ఆర్య వెల్లడించారు.

కాగా, ఆది, సోమవారాల్లో భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచర్చింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే ఉత్తరాఖండ్‌లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నందప్రయాగ, భనేరోపాణి వద్ద జాతీయ రహదారి ధ్వంసమవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Tags:    

Similar News