Waqf Act: పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లు
జేపీసీ నివేదికను 29లోపు సభ ముందు పెట్టే అవకాశం
: ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు-2024 చర్చకు రానుంది. లోక్సభ సచివాలయం బుధవారం విడుదల చేసిన బులిటెన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆగస్టు 8న సభ ముందు ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఆ మరుసటి రోజు జాయింట్ కమిటీ అధ్యయనం కోసం పంపారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి వారం చివరి రోజు కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించాలని ఇదివరకే నిర్దేశించారు. అందువల్ల జాయింట్ కమిటీ తన నివేదికను 29లోపు సభ ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లుపై సభలో చర్చించి మోదించనున్నారు. దీంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్-అమెండ్మెంట్ బిల్లు, రైల్వేస్ బిల్లు, బ్యాంకింగ్ లాస్ వంటి బిల్లులను గత ఆగస్టులోనే సభలో ప్రవేశపెట్టినట్టు సచివాలయం పేర్కొంది. అలాగే కొత్తగా 5 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, నివేదికకు తుది మెరుగులు దిద్దనుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ). అందులో భాగంగా బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని కమిటీ గురువారం భేటీ కానుంది. వక్ఫ్ బిల్లుపై నివేదికను ఫైనల్ చేయనుంది.
కాగా.. ఈ సమావేశాల్లో ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’ చర్చకు రానుంది. లోక్సభ సచివాలయం బుధవారం విడుదల చేసిన బులిటెన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆగస్టు 8న సభ ముందు ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఆ మరుసటి రోజు జాయింట్ కమిటీ అధ్యయనం కోసం పంపారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి వారం చివరి రోజు కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించాలని ఇదివరకే నిర్దేశించిన విషయం విదితమే. అందువల్ల జాయింట్ కమిటీ తన నివేదికను 29లోపు సభ ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లుపై సభలో చర్చించి ఆమోదించనున్నారు.
కాగా.. వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘‘వక్ఫ్ సవరణ బిల్లు 2024’’ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడంతో దీన్ని పునఃపరిశీలించేందుకు లోక్సభ, రాజ్యసభ సభ్యులతో ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ ఏర్పాటు చేశారు. జేపీసీ కమిటీ ఛైర్మన్గా బీజేపీ నేత జగదాంబికా పాల్ వ్యవహరించారు. ఈ క్రమంలో వచ్చే శీతాకాల సమావేశాల్లో భాగంగా నివేదిక అందించాలని గడువు విధించారు. ఇక, కమిటీలో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించారు. పలు చర్చల అనంతరం ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంట్లో చర్చకు రానుంది.