Gurugram: ఆరేళ్ల బాలుడి ప్రాణం తీసిన హౌసింగ్ సొసైటీ స్విమ్మింగ్ పూల్‌..

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈత కొలనులో మునిగి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడని పోలీసులు గురువారం తెలిపారు.;

Update: 2024-07-25 09:48 GMT

గురుగ్రామ్‌లోని సెక్టార్ 37డిలోని బిపిటిపి పార్క్ సెరీన్ సొసైటీలోని స్విమ్మింగ్ పూల్‌లో బాలుడు మునిగిపోయాడు.  ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేయడం లేదని స్థానికులు ఆరోపించారు. స్థానిక క్లబ్ సిబ్బంది నిర్లక్ష్యమే చిన్నారి మృతికి కారణమని సొసైటీ వాసులు ఆరోపించారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సొసైటీ నివాసులను పోలీసులు బెదిరిస్తున్నారని ఓ ఫ్లాట్ యజమాని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News