Delhi Liquor Scam: మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది..!
ఢిల్లీ లిక్కర్ కేసులో త్వరలో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడాన్ని సవాల్ చేయనుంది ఆప్
ఢిల్లీ లిక్కర్ కేసులో త్వరలో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడాన్ని సవాల్ చేయనుంది ఆప్. న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో రౌస్ అవెన్యూ కోర్టులో ఆప్ నేతలు పిటిషన్ వేయనున్నారు. శరత్ చంద్రారెడ్డిపై గతంలో దర్యాప్తు సంస్థలు మోపిన అభియోగాలు సహా.. లిక్కర్ కేసుకు సంబంధించి కీలక అంశాల్ని పిటిషన్లో ఆప్ ప్రస్తావించనుంది. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడానికి ఈడీ ఓకే చెప్పింది. శరత్ చంద్రారెడ్డి అభ్యర్థనకు ప్రత్యేక కోర్టు అంగీకారం తెలిపింది. అప్రూవర్గా మారడానికి ముందే.. పూర్తిస్థాయి బెయిల్లో బయట ఉన్నారు శరత్ చంద్రారెడ్డి. ఆప్ కన్వీనర్, ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ టార్గెట్గానే.. పరిణామాలు జరుగుతున్నాయని ఆప్ నేతలు అనుమానిస్తున్నారు.