నారీ పూజలో నటి ఖుష్బు.. దేవుని ఆశీస్సులు ఉంటేనే ఈ అదృష్టం అంటూ..

కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నటి ఖుష్బు రాజకీయాలతో పాటు మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. తాజాగా ఖుష్బు చేసిన పోస్ట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

Update: 2023-10-04 08:23 GMT

కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నటి ఖుష్బు రాజకీయాలతో పాటు మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. తాజాగా ఖుష్బు చేసిన పోస్ట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఇటీవల ఖుష్బు కేరళలోని త్రిసూర్‌లోని విష్ణుమాయ దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ఆమెకు పాదాలు కడిగి నారీ పూజ నిర్వహించారు. ఇది విష్ణుమాయ దేవాలయంలో అనాదిగా వస్తున్న ఆచారం. ఇలాంటి పూజ ఈ గుడిలో ఏటా జరుగుతుంటుంది.

కేరళ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో స్త్రీలను దేవతలుగా పూజించే ఆచారం ఉంది. ఆలయ పూజారులు స్త్రీ పాదాలను కడిగి, అమ్మవారికి పూజలు చేసి, వారి సంప్రదాయాన్ని పాటిస్తారు. దీనినే నారీ పూజ అంటారు. 

ఖుష్బు ఆమెను పూజించిన ఫోటోలను పంచుకోవడంతో పాటు, ఈ ఆచారానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా పంచుకుంది. నేను దేవునిచే ఆశీర్వదించబడ్డాను. కేరళలోని త్రిస్సూర్‌లోని విష్ణుమాయ ఆలయంలో నారీ పూజ చేయడానికి నన్ను ఆహ్వానించడం నా అదృష్టం. ఎంపిక చేసిన కొందరిని మాత్రమే ఇక్కడ పూజల కోసం పిలుస్తుంటారు. దేవుడు తమను ఎన్నుకున్నాడని నమ్ముతారు. నన్ను ఆశీర్వదించి, గౌరవించినందుకు ఆలయ ధర్మకర్తల మండలికి ధన్యవాదాలు' అని ఖుష్బూ పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు.. ` ఓ ముస్లిం మహిళ రాజకీయాల కోసమే ఇలా చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. మరికొందరు ``దేవుడు మేలు చేస్తాడు'', ``వర్ణించడానికి మాటలు రావడం లేదు'' అంటూ సానుకూల వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News