Air India Crash : బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిన విమానం..
ప్రమాదంలో ఐదుగురు మృతి.. ఐదుగురు గల్లంతు;
అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం మేఘానినగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలపై కుప్పకూలింది. దీంతో భారీయెత్తున మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొన్నది. భవ నం పైకప్పు, గోడలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో భోజనం చేస్తున్న నలుగురు మెడికో విద్యార్థులు, ఒక డాక్టర్ భార్య మరణించగా, ఇద్దరు విద్యార్థులు, ముగ్గురు డాక్టర్ బంధువులు గల్లంతయ్యారు. 19 మం ది గాయపడగా, వారిలో ఐదుగురికి తీవ్ర గా యాలయ్యాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
విమానం కూలిన శబ్దా న్ని వినగానే ‘భూకంపం వచ్చిందా?’ అని తా ము భయపడిపోయామని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. గాయపడ్డ విద్యార్థులకు స్థానికులు ఒకవైపు సహాయక చర్యలు అందిస్తూనే మరోవైపు అధికారులకు సమాచారమిచ్చారు. ప్రమాదం గురించి తెలియగానే 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 బీఎస్ఎఫ్ యూనిట్లు, పదుల సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్య లు చేపట్టాయి. హాస్టల్లోని క్షతగాత్రులకు వేగవంతమైన వైద్య చికిత్స అందించడానికి గ్రీన్ కారిడార్ను అధికారులు ఏర్పాటు చేశారు.
విద్యార్థులు భోజనాలు చేస్తున్న సమయం లో ప్రమాదం జరుగడంతో మెస్లో ప్లేట్లు, ఆహారం చిందరవందర గా పడ్డాయి. విమానం తో క భాగం బిల్డింగ్లోకి చొ చ్చుకుపోయిన దృశ్యాలు వైరల్గా మారాయి. మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్లోకి తొలు త దూసుకుపోయిన విమానం ఆ తర్వాత సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఉండేటువంటి అతుల్యమ్ హాస్టల్లోకి కూడా చొచ్చుకుపోయినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్టు తెలిపారు. కూలిపోవడాని కంటే ముందు విమానం చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించినట్టు హరీశ్ షా అనే వ్యక్తి పీటీఐతో అన్నారు.