Jammu Kashmir: లోయలో ఆర్మీ బస్సు.. ఆరుగురు జవాన్లు మృతి..
Jammu Kashmir: జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ బస్సు లోయలో పడటంతో ఆరుగురు జవాన్లు మృతి చెందారు.;
Jammu Kashmir: జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ బస్సు లోయలో పడటంతో ఆరుగురు జవాన్లు మృతి చెందారు. 30 మందికి గాయాలయ్యాయి. పహల్గామ్ జిల్లాలో ఐటీబీపీ జవాన్ల బస్సు లోయలో పడింది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది జవాన్లు ఉన్నారు. ఫ్రిస్లాన్ వద్ద బస్సు బ్రేక్లు ఫెయిలవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమర్నాథ్ యాత్ర వద్ద విధులు నిర్వహిస్తున్న జవాన్లు బస్సులో ఉన్నారు. చందన్వారి నుంచి పహల్గామ్ వెళ్తుండగా ఘటన జరిగింది.