Arvind Kejriwal: అతిషీని కూడా అరెస్టు చేయవచ్చు, : అరవింద్ కేజ్రీవాల్

కేజ్రీవాల్, అతిషి మీడియా సమావేశం;

Update: 2024-12-25 07:45 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం (డిసెంబర్ 25) బిజెపిని టార్గెట్ గా చేసుకున్నారు. ఈ సమయంలో, ఢిల్లీ ప్రభుత్వం తన ప్రణాళికలను నిలిపివేసిందని ఆరోపించారు. అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అతిషిని ఫేక్ కేసులో అరెస్ట్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అతిషి కూడా ఉన్నారు.

‘బీజేపీకి ఎలాంటి కథనాలు లేవు’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పదేళ్లుగా వారు చేసిందేమీ లేదన్నారు. తనకు ఓటేస్తే ఏం చేస్తాడో చెప్పలేకపోతున్నారని కేజ్రీవాల్ అన్నారు. కానీ కేజ్రీవాల్ ఏం చేశాడో అందరికీ తెలుసునన్నారు. బీజేపీకి సీఎం క్యాండిడేట్ లేడన్నారు. ఢిల్లీలో పాఠశాలలు, ఆసుపత్రులు, విద్యుత్, నీరు, బస్సు ప్రయాణం, తీర్థయాత్ర ప్రతిదానిలో అభివృద్ధి చేశామన్నారు. అందుకే మాకే ఓటేయాలని కేజ్రీవాల్ కోరారు.

రెండు పథకాలు ప్రకటించామని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలిస్తే మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, ఇటీవల ఈడీ, సీబీఐ, ఐటీ సమావేశం జరిగింది. త్వరలో మా నాయకులందరిపై దాడి ఉంటుంది. రవాణా శాఖలో అతిషీపై ఫేక్ కేసు కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆమెను కూడా త్వరలో అరెస్ట్ చేస్తారన్నారు. ఎన్నికల్లో మమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతాయన్నారు.

రవాణా శాఖకు సంబంధించిన ఏదో ఒక విషయంలో తన పై ఫేక్ కేసు పెడుతున్నట్లు వార్త అందిందని అతిషి తెలిపారు. నిజాయితీగా పనిచేశాం. నిజం బయటకు వస్తుంది. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏది ఫేక్ కేసు అయినా నిజమే గెలుస్తుందని అతిషి తెలిపారు. మాపై తప్పుడు ఆరోపణలు చేసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రతిదాన్ని ఢిల్లీ ప్రజలు గమనిస్తున్నారని బిజెపి ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నాను. బీజేపీకి ప్రజలే సమాధానం చెబుతారని అతిషి హెచ్చరించారు.

Tags:    

Similar News