బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులోనే తాను లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి సమగ్ర శిక్ష అభియాన్ నాయకులు సమస్యలు పరిష్కరించాలని కేంద్రమంత్రికి వినతి పత్రం అందించారు. అనంతరం అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ నాయకత్వం తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పెద్ద బాధ్యతలను అప్పగించిందన్నారు. ఆ బాధ్యత లను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు తాను చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నానన్నారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగిస్తారని వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారమంతా ఊహాగానాలేనని కొట్టిపారేశారు. పార్టీ నాయకత్వం అసలు రాష్ట్ర అధ్యక్ష పదవిపై ద్రుష్టి సారించనేలేదన్నారు. రాష్ట్ర అధ్యక్ష నియామకం విషయంలో బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని, అందరూ దానికి కట్టుబడి ఉండాలన్నారు.