Bangalore: పెంపుడు చిలుకను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన వ్యాపారి..
రూ.2.5 లక్షల విలువైన తన పెంపుడు చిలుక ఎగిరి వెళ్లి ట్రాన్స్ ఫార్మర్ మీద వాలింది. ఎక్కడ దానికి విద్యుత్ షాక్ తగులుంతుందో అని ఆందోళన చెందాడు.
బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త చేతిలో స్టీల్ పైపు పట్టుకుని తన పెంపుడు చిలుక మకావ్ను తిరిగి తీసుకురావడానికి కాంపౌండ్ గోడపైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు హైవోల్టేజ్ లైన్ను తాకి విద్యుత్ షాక్కు గురై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. ఈ సంఘటన బెంగళూరులోని గిరినగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తిని అరుణ్ కుమార్గా గుర్తించారు.
కుమార్ దగ్గర ఉన్న మకావ్ అనే రామచిలుక శుక్రవారం ఉదయం ఇంటి నుంచి పారిపోయి సమీపంలోని విద్యుత్ స్తంభంపై వాలింది. దీని విలువ దాదాపు రూ.2.5 లక్షలు.
"అతను స్టీల్ పైపును ఉపయోగించి పక్షిని రక్షించడానికి ప్రయత్నించాడు, అది ప్రమాదవశాత్తు అధిక-వోల్టేజ్ లైన్ను తాకడంతో అతడు షాక్ కి గురయ్యాడు. దాంతో కిందపడిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. అతనికి వాహన నంబర్ ప్లేట్ తయారీ వ్యాపారం ఉంది. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.
విద్యుత్ ఘాతంతో మృతి చెందిన మరో మహిళ
నైరుతి ఢిల్లీలోని మహిపాల్పూర్లోని తన ఇంట్లో విద్యుత్ రాడ్తో నీటిని వేడి చేస్తుండగా 23 ఏళ్ల మహిళ విద్యుదాఘాతంతో మరణించింది.
"ఆ మహిళ స్నానం చేయడానికి వెళ్లి విద్యుత్ రాడ్ ఉపయోగించి నీటిని వేడి చేస్తోందని ప్రాథమిక విచారణలో తేలింది. ఆమె చాలా సేపటి వరకు బయటకు రాకపోవడంతో, అదే భవనంలో నివసిస్తున్న ఆమె స్నేహితురాలు ఆమెను తనిఖీ చేయడానికి వెళ్లి చూడగా లోపలి నుండి తలుపు గడియ వేసి ఉండటం కనిపించింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫోన్ చేసింది". విద్యుత్ షాక్ తో మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు.