BENGAL: బెంగాల్ రాజకీయాల్లో కొత్త తుఫాన్

కేంద్రం-రాష్ట్రం మధ్య ముదురుతున్న మాటల యుద్ధం

Update: 2026-01-10 04:45 GMT

కో­ల్‌­క­తా­లో­ని ప్ర­ముఖ రా­జ­కీయ కన్స­ల్టె­న్సీ ఐ-ప్యా­క్ కా­ర్యా­ల­యం, దాని డై­రె­క్ట­ర్ ప్ర­తీ­క్ జైన్ ని­వా­సా­ల­పై ఎన్‌­ఫో­ర్స్‌­మెం­ట్ డై­రె­క్ట­రే­ట్ (ఈడీ) ని­ర్వ­హిం­చిన సో­దా­లు పశ్చిమ బెం­గా­ల్ రా­జ­కీ­యా­ల్లో కల­క­లం రే­పా­యి. ఈ నే­ప­థ్యం­లో శు­క్ర­వా­రం ఉదయం తృ­ణ­మూ­ల్ కాం­గ్రె­స్ ఎం­పీ­లు మహు­వా మొ­యి­త్రా, డె­రె­క్ ఓ’బ్రి­య­న్ తది­త­రు­లు ఢి­ల్లీ­లో­ని కేం­ద్ర హోం­మం­త్రి  అమి­త్ షా కా­ర్యా­ల­యం ముం­దు ధర్నా చే­ప­ట్టా­రు. దీం­తో రం­గం­లో­కి ది­గిన పో­లీ­సు­లు వా­రి­ని అక్క­డి నుం­చి లా­గే­సి, అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు.  ఇదే సమ­యం­లో కో­ల్‌­క­తా­లో ఈడీ సో­దా­ల­పై ము­ఖ్య­మం­త్రి, టీ­ఎం­సీ అధి­నే­త్రి మమతా బె­న­ర్జీ తీ­వ్ర ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. ఈడీ చర్య­లు పూ­ర్తి­గా రా­జ­కీయ ప్రే­రే­పి­త­మ­ని, రా­బో­యే అసెం­బ్లీ ఎన్ని­క­ల­ను దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని తృ­ణ­మూ­ల్ పా­ర్టీ­ని బె­ది­రిం­చ­డ­మే లక్ష్యం­గా కేం­ద్రం వ్య­వ­హ­రి­స్తోం­ద­ని ఆమె ఆరో­పిం­చా­రు. గు­రు­వా­రం ఈడీ సో­దాల సమా­చా­రం అం­దిన వెం­ట­నే మమతా బె­న­ర్జీ హు­టా­హు­టిన ప్ర­తీ­క్ జైన్ ని­వా­సా­ని­కి చే­రు­కు­న్న సం­గ­తి తె­లి­సిం­దే. అక్క­డే ఉన్న ఈడీ అధి­కా­రుల ఎదుట ని­ర­సన తె­లి­పా­రు. ఐ-ప్యా­క్ కా­ర్యా­ల­యం­లో తృ­ణ­మూ­ల్ పా­ర్టీ­కి సం­బం­ధిం­చిన కీ­ల­క­మైన డేటా, ఎన్ని­కల వ్యూహ పత్రా­లు, అభ్య­ర్థుల సమా­చా­రం ఉన్నా­య­ని, వా­టి­ని స్వా­ధీ­నం చే­సు­కు­నేం­దు­కే ఈడీ అధి­కా­రు­లు వచ్చా­ర­ని ఆమె ఆరో­పిం­చా­రు. కొ­న్ని గంటల పాటు అక్కడ హై­డ్రా­మా కూడా చో­టు­చే­సు­కుం­ది. ప్ర­శాం­త్ కి­శో­ర్ నే­తృ­త్వం­లో ఏర్ప­డిన ఐ-ప్యా­క్ ప్ర­స్తు­తం బెం­గా­ల్‌­లో తృ­ణ­మూ­ల్ కాం­గ్రె­స్ ఐటీ, ప్ర­చార వ్యూ­హా­ల­ను ని­ర్వ­హి­స్తోం­ది. ఈ నే­ప­థ్యం­లో ఐ-ప్యా­క్‌­ను లక్ష్యం­గా చే­సు­కో­వ­డం ద్వా­రా పా­ర్టీ ఎన్ని­కల వ్యూ­హా­ల­ను దె­బ్బ­తీ­యా­ల­న్న­దే కేం­ద్ర ప్ర­భు­త్వ ఉద్దే­శ­మ­ని టీ­ఎం­సీ నే­త­లు ఆరో­పి­స్తు­న్నా­రు.

బొగ్గు కుంభకోణం నేపథ్యం

బెంగాల్‌లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ మైన్స్ లో వందల కోట్ల రూపాయల విలువైన బొగ్గు అక్రమ రవాణా జరిగినట్లు 2020లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నగదు అక్రమ చలామణి వెలుగులోకి రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. స్థానిక వ్యాపారి అనూప్ మాఝీ (లాలా) ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఇదే కే­సు­లో తృ­ణ­మూ­ల్ ఎంపీ, మమత మే­న­ల్లు­డు అభి­షే­క్ బె­న­ర్జీ­ను ఇప్ప­టి­కే ఈడీ వి­చా­రిం­చిం­ది. ఈ కేసు దర్యా­ప్తు­లో భా­గం­గా కో­ల్‌­క­తా సా­ల్ట్‌­లే­క్‌­లో­ని ఐ-ప్యా­క్ కా­ర్యా­ల­యం, ఢి­ల్లీ­లో­ని నా­లు­గు ప్రాం­గ­ణా­ల్లో గు­రు­వా­రం ఉదయం ఏడు గంటల నుం­చే ఏక­కా­లం­లో ఈడీ సో­దా­లు ప్రా­రం­భిం­చిం­ది. ప్ర­తీ­క్ జైన్ ద్వా­రా కొ­న్ని హవా­లా లా­వా­దే­వీ­లు జరి­గి­న­ట్లు ని­ర్ది­ష్ట ఆధా­రా­లు ఉన్నా­య­ని ఈడీ చె­బు­తోం­ది. బొ­గ్గు స్మ­గ్లిం­గ్‌­కు సం­బం­ధిం­చిన హవా­లా ఆప­రే­ట­ర్ ద్వా­రా ఐ-ప్యా­క్‌­కు చెం­దిన సం­స్థ­కు కో­ట్ల రూ­పా­యల లా­వా­దే­వీ­లు జరి­గి­న­ట్లు పే­ర్కొ­న్నా­రు.

తగిన రీతిలో స్పందిస్తాం: మమతా

సో­దాల సమ­యం­లో మమతా బె­న­ర్జీ స్వ­యం­గా ఐ-ప్యా­క్ కా­ర్యా­ల­యా­ని­కి చే­రు­కు­ని ఈడీ అధి­కా­రు­ల­తో వా­గ్వా­దా­ని­కి ది­గా­రు. ‘‘రా­జ­కీయ పా­ర్టీ సమా­చా­రా­న్ని స్వా­ధీ­నం చే­సు­కో­వ­డం ఈడీ వి­ధు­ల్లో భా­గ­మా?’’ అంటూ ప్ర­శ్నిం­చా­రు. తమ పా­ర్టీ­కి సం­బం­ధిం­చిన హా­ర్డ్‌­డి­స్కు­లు, మొ­బై­ల్ ఫో­న్లు, వ్యూహ పత్రా­ల­ను తీ­సు­కె­ళ్లేం­దు­కు ప్ర­య­త్నిం­చా­ర­ని ఆరో­పిం­చా­రు. ‘‘మా సమా­చా­రా­న్ని కాపీ చే­య­డం నేరం’’ అంటూ కేం­ద్రం­పై మం­డి­ప­డ్డా­రు. ఈడీ చర్య­ల­కు ని­ర­స­న­గా శు­క్ర­వా­రం తన నా­య­క­త్వం­లో కో­ల్‌­క­తా­లో భారీ ని­ర­సన ప్ర­ద­ర్శన ని­ర్వ­హి­స్తా­మ­ని మమత ప్ర­క­టిం­చా­రు. తనను అడ్డు­కుం­టే తగిన రీ­తి­లో స్పం­ది­స్తా­మ­ని హె­చ్చ­రిం­చా­రు. ఈడీ మా­త్రం తమ చర్య­లు పూ­ర్తి­గా చట్ట­బ­ద్ధ­మే­న­ని, రా­జ­కీ­యా­ల­తో ఎలాం­టి సం­బం­ధం లే­ద­ని స్ప­ష్టం చే­సిం­ది. సో­దాల సమ­యం­లో కీలక పత్రా­లు, కం­ప్యూ­ట­ర్లు స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­మ­ని తె­లి­పిం­ది. మరో­వై­పు ఈడీ దర్యా­ప్తు­ను మమత అడ్డు­కు­న్నా­ర­ని ఆరో­పి­స్తూ కల­క­త్తా హై­కో­ర్టు­ను ఆశ్ర­యిం­చిం­ది. ఐ-ప్యా­క్ కూడా సో­దాల చట్ట­బ­ద్ధ­త­ను ప్ర­శ్ని­స్తూ హై­కో­ర్టు­లో పి­టి­ష­న్ దా­ఖ­లు చే­సిం­ది.

Tags:    

Similar News