Bengaluru Stampede: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం..
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆర్సీబీ యాజమాన్యం, కేఎస్సీఏ;
ఐపీఎల్ 2025 టైటిల్ను గెలుచుకున్న సందర్భంగా బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు విషాదంగా ముగిసాయి. ఈ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మంది కి పైగా గాయపడ్డారు. స్టేడియం బయట సుమారు రెండు లక్షల మంది అభిమానులు భారీగా గుమికూడటంతో, పరిస్థితిని పోలీసులు నియంత్రించలేకపోయారు.
ఈ విషాద ఘటనపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రకటనలో వారు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆర్సీబీ – కేఎస్సీఏ, ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన బాధాకర సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ దుర్ఘటనపై సానుభూతిగా ఆర్సీబీ, మరియు కేఎస్సీఏ సంయుక్తంగా, ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఈ పరిహారం మానవ జీవితానికి మాత్రమే కాకుండా, బాధిత కుటుంబాలకు ఓదార్పుగా ఇవ్వబడుతోంది. ఇది మానవ జీవితం విలువను తూకం వేయాలనే ఉద్దేశంతో కాదు, కేవలం వారి బాధలో మేము వారి వెంట ఉన్నామని తెలియజేయడమే ఉద్దేశ్యమని ప్రకటనలో వివరించారు.