పలు రాష్ట్రాలకు ఇంఛార్జీలను మార్చిన బీజేపీ.. పురందేశ్వరి, డీకే అరుణ..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఇంఛార్జీలను మార్చింది బీజేపీ అధిష్టానం . తెలంగాణ బీజేపీ ఇంచార్జ్గా తరుణ్ చౌగను నియమించింది. ఏపీ బీజేపీ ఇంఛార్జ్గా మురళీధరన్ను..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఇంఛార్జీలను మార్చింది బీజేపీ అధిష్టానం . తెలంగాణ బీజేపీ ఇంచార్జ్గా తరుణ్ చౌగను నియమించింది. ఏపీ బీజేపీ ఇంఛార్జ్గా మురళీధరన్ను నియమించగా.. సహా ఇంఛార్జ్గా సునీల్ దేవధర్ను కొనసాగించింది. ఇక ఏపీకి చెందిన పురందేశ్వరిని రెండు రాష్ట్రాలకు ఇంఛార్జ్గా నియమించింది బీజేపీ హైకమాండ్. ఛత్తీస్ఘడ్, ఒడిసా ఇంచార్జ్గా పురందేశ్వరిని నియమించింది. కర్నాటక సహా ఇంచార్జ్గా డీకే అరుణకు బాధ్యతలు అప్పగించింది. మధ్యప్రదేశ్ ఇంచార్జ్గా మురళీధర్రావును నియమించింది. ఇక తమిళనాడు ఇంఛార్జ్గా పొంగులేటి సుధాకర్రెడ్డికి బాధ్యతలు అప్పగించింది బీజేపీ హైకమాండ్.