బిహార్ భగల్పూర్ జిల్లాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. నౌగాచియా ప్రాంతంలో పడవ బోల్తా పడింది. దాదాపు 50 మంది కూలీలతో వెళ్తున్న పడవ... ఓవర్ లోడ్ కావడంతో నీట మునిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డగా... మరికొంత మంది గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు, స్థానికులతో గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.