రైలు బయలుదేరే సమయానికి 5 నిమిషాల ముందు వరకూ కూడా రిజర్వేషన్ టికెట్టు రద్దు, అలాగే బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు నుంచి రైల్వే శాఖలో ఈ కొత్త సౌకర్యం అమల్లోకి వచ్చింది. రైలు బయల్దేరే సమయానికి 4గంటల ముందు మొదటి రిజర్వేషన్ చార్టు రెడీ చేస్తారు.. రెండో చార్టును 30 - 5 నిమిషాల ముందు రెడీ చేసి డిస్ప్లే చేస్తారు. ఖాళీలను బట్టి పాసింజర్ రిజర్వేషన్ కౌంటర్లు(పీఆర్ఎస్) ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు జారీ చేస్తారు. కొత్త సౌకర్యం ఈ నెల 17 నుంచి పట్టాలెక్కే తేజ్సతో సహా అన్ని ప్రత్యేక రైళ్లకు వర్తించనుంది.