Cyclone Dana: ఒడిశా దగ్గర తీరం దాటిన దానా తుఫాన్..
ఒడిశా తీరప్రాంత జిల్లాలలో భారీ వర్షాలు..;
మొత్తానికి దానా తుఫాన్ తీరం దాటింది. అర్ధరాత్రి 1:30 నుంచి 3:30 మధ్య తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని భితార్కానికా నేషనల్ పార్క్, ధమ్రా మధ్య తీరాన్ని తాకినట్టు ప్రకటించారు. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచినట్లు పేర్కొన్నారు. దీంతో ఒడిశా సముద్ర తీరం మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఇక, ఉత్తరాంధ్ర పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను ఐఎండీ జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు చేశారు
ఇక, భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగాపొయాయి. ఈ తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్- ఒడిశా మధ్య ఏకంగా 400లకు పైగా రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో పాటు కోల్కతా, భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ల్లో సేవలను గురువారం సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు పూర్తిగా నిలిపివేశారు.
తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం ఏడు వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని హైరిస్క్ జోన్ల నుంచి 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక బెంగాల్లో కూడా దానా తుఫాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల నుంచి 3.5 లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో శుక్రవారం స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తుఫాను ప్రభాను ప్రభావం విమానాల రాకపోకలపై పడింది. భువనేశ్వర్లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, కోల్కతా ఎయిర్పోర్టును అధికారులు మూసివేశారు. 4 వేల రైళ్లను రద్దు చేశారు.