Asaduddin Owaisi: అసదుద్దీన్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు..

Asaduddin Owaisi: MIM చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2022-06-09 15:50 GMT

Asaduddin Owaisi: MIM చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు తనపై కేసు నమోదు చేయడంపై మండిపడ్డారు ఒవైసీ. ఢిల్లీ పోలీసులపై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. బీజేపీని వ్యతిరేకించే వారిపై కేసులు పెట్టడం ద్వారా బీజేపీ మద్దతుదారులను పోలీసులు సంతోషపెడుతున్నారంటూ విమర్శించారు. ఢిల్లీ పోలీసులు బ్యాలెన్స్ వాడ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారన్నారు. ఈ కేసులను తాను భయపడేది లేదన్నారు.

Tags:    

Similar News