Marriage: కొడుకుతో నిశ్చితార్థం.. కోడలిని పెళ్లి చేసుకున్న మామ..

కోడలితో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడేవాడు;

Update: 2025-06-20 07:30 GMT

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్‌ లోని అలీగఢ్‌ కు చెందిన ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోగా.. తాజాగా అదే రాష్ట్రంలోని రాంపూర్‌ లో ఓ వ్యక్తి కాబోయే కోడలును పెళ్లి చేసుకుని జంప్‌ అయ్యాడు. అతడి తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులను కొట్టి మరీ పెళ్లి కుమార్తెతో పారిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే.. రాంపూర్‌కు చెందిన షకీల్‌ అనే వ్యక్తి తన 15 ఏళ్ల కుమారుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయం చేశాడు. అప్పటి నుంచి కాబోయే కోడలుతో నిత్యం ఫోన్‌లో మాట్లాడాడు. ఈ క్రమంలో ఇద్దరూ హద్దులు దాటారు. విషయం తెలిసిన కొడుకు ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు.

షకీల్ భార్య షబానా కూడా తన భర్త తీరును తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో భార్య, కొడుకు ఇద్దరిని కొట్టి.. షకీల్ తనకు కాబోయే కోడలును పెళ్లి చేసుకున్నాడు. అంతేగాక పెళ్లి కోసం తెచ్చి ఉంచిన నగలు, నగదు ఎత్తుకుని ఆమెతో లేచిపోయాడు. రెండు నెలల క్రితం అలీగఢ్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

అనిత అనే మహిళ కాబోయే అల్లుడితో లేచిపోయింది. తన కుమార్తె శివానీకి పెళ్లి నిశ్చయం చేసిన ఆమె కాబోయే అల్లుడితో నిత్యం ఫోన్‌లో మాట్లాడి ప్రేమలో పడింది. పెళ్లి కోసం తెచ్చిపెట్టిన రూ.3.5 లక్షల నగదు, నగలు ఎత్తుకుని బిడ్డకు కాబోయే వాడితో లేచిపోయింది.

Tags:    

Similar News