UP Election 2022: ఉత్తరప్రదేశ్‌లో ముగిసిన తొలి దశ ఎన్నికల పోలింగ్‌..

UP Election 2022: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఫస్ట్‌ పేజ్‌ పోలింగ్‌ ముగిసింది.

Update: 2022-02-10 14:16 GMT

UP Election 2022: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఫస్ట్‌ పేజ్‌ పోలింగ్‌ ముగిసింది. 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో.. ప్రజల ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా.. పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 57.29 శాతం పోలింగ్‌ నమోదైంది. 623 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు.. ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

జాట్‌లు, ముస్లింల ప్రాభల్యం ఎక్కువగా ఉండే తొలి ఫేజ్‌ పోలింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే అటు బీజేపీ.. ఇటు ఎస్పీ కూటమీ.. తొలి దశపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముస్లిం తమకే ఓటు వేశారని బీజేపీ అంటుండగా.. 58 స్థానాల్లో 50 గెలుచుకుంటామని ఎస్పీ సీఎం అభ్యర్థి అఖిలేష్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News