సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీ కుమార్‌ ఆత్మహత్య

Update: 2020-10-08 00:58 GMT

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారు. అశ్వనీ కుమార్‌ మణిపూర్‌, నాగాలాండ్‌ గవర్నర్‌గానూ పని చేశారు. శిమ్లాలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అశ్వనీ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారని శిమ్లా ఎస్పీ మోహిత్‌ చావ్లా ప్రకటించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. 2008 ఆగస్టు 2 నుంచి నుంచి 2010 నవంబర్‌ 10 వరకు సీబీఐ డైరెక్టర్‌గా పని చేసిన అశ్వనీ కుమార్‌... పదవీ విరమణ తర్వాత మణిపూర్‌, నాగాలాండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

Tags:    

Similar News